Friday, July 10, 2009

తక్షణ కర్తవ్యం

ఉవ్వెత్తున లేచిన తరంగం తీరాన్ని తాకేటప్పుడు చూసే వారికి కలిగే ఆనందం ఎంతో గొప్పగా వుంటుంది. అలాగే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు ఎంతో మందికి కలిగిన ఆనందం చెప్పనలవి కాదు. కాని ఇప్పుడు జరుగుతున్నదేమిటి? చావు తప్పి కన్ను లొట్ట పోయినంత మాత్రం కాకపోయినా, పంతొమ్మిది సీట్లు వచ్చాయి కదా. ఆ ఎమ్మెల్యేలు వుంటారా లేదా ఎగిరిపోతారా అనే సంశయం కలుగుతోంది. సామాజిక న్యాయం అంటూ ప్రజలతో ఆడుకున్నారా? లేక ప్రజలు ఏం చెప్పినా వింటారు అనుకుంటున్నారా? గెలిచిన స్థానాలలో ఏం చెయ్యాలో ఆలోచించడం లేదెందుకు? అసెంబ్లీ లేనప్పుడు తమ తమ నియోజక వర్గాల్లో తిరగమని తమవాళ్ళకు చెప్పొద్దా చిరంజీవి గారు. అంతే గాని సమీక్షలు అంటూ హైదరాబాదులో కాలం ఎందుకు వృధా చేస్తున్నారు?