Wednesday, September 3, 2014

రాజధాని రాజకీయాలు

భూ బకాసురులకు అనుగుణంగా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించాలనుకోవడం చాలా బాధాకరంగా వుంది. బంగారం పండించే రైతుల వద్ద నుండి ఏదో రకంగా భూములు లాక్కొని కాంక్రీటు అరణ్యాలు సృష్టించాలనుకోవడంలో ఏం న్యాయం వుంది? వ్యవసాయాధారిత పరిశ్రమల  స్థాపనకు భూములు వాడుకోవడంలో అర్థం వుంటుంది. భూములు అమ్ముకున్న రైతులు వారి జీవన విధానాన్ని ఎలా మార్చుకుంటారు? వచ్చిన నడమంత్రపు సిరి వారిని ఎటువంటి ఇబ్బందులకు లోను చేస్తుందో? అసలు ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటున్న కృష్ణా, గుంటూరు జిల్లాలలో కాకుండా దొనకొండ లాంటి ప్రదేశంలో కావలసిన విధంగా రాజధాని నిర్మాణాన్ని చేపట్టి కావలసిన సౌకర్యాలను కాలక్రమేణా ఏర్పాటు చేసుకోవడం మంచిది. కొత్త ప్రాంతాలు కూడా అభివృధ్హి చెందడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది.


1 comment: