Tuesday, May 12, 2009

చనిపోయిన వారికి కర్మకాండలు అవసరమా? - 2

....ఈ కర్మకాండలు చేయకపోతే 'ఈ ప్రేతాత్మ' ఇక్కడే తిరుగుతూ వుంటుందని అది బ్రతికున్న మనకు, మన పిల్లలకు మంచిది కాదని నూరి పోస్తారు. మన మధ్యలోనుంచి వెళ్ళిపోయిన మనిషి ప్రేతత్మగా మారి మన చుట్టూ తిరిగితే మనకేమిటి? మనకెలా చెడు జరుగుతుంది? మరణం తర్వాత మనమెవ్వరూ చూడని ఏదో లోకాలకు ఆ ఆత్మ వెళ్లి మన పితృ దేవతలను చేరుకోవాలాట. దీన్ని ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఆ ఆత్మ మనకెందుకు చెడు చేస్తుంది?
చనిపోయిన మనుషులు బ్రతికున్న వారి జ్ఞాపకాలలో బ్రతుకుతారు గాని ఎక్కడో ఏదో లోకాలలో మాత్రం కాదు. కర్మకాండలు, శ్రాద్దకర్మల పేర్లతో బ్రతికున్న మనమెందుకు వేలకువేల రూపాయలు ఖర్చు చేయాలి?
జబ్బుతో వున్న మనిషిని ఎంతయినా ఖర్చు పెట్టి కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడంలో అర్థం వుంది. ఆ మనిషి బ్రతికి పది కాలాల పాటు ఉండాలని కోరుకోవడంలో అర్థం వుంది. కాని అదే మనిషి దురదృష్టవశాత్తూ చనిపోతే అతన్ని దహనం లేదా ఖననం చేయడం మన బాధ్యత. ఆ తర్వాత కర్మకాండకు అంటూ వేలకు వేలు ఖర్చు చేయడం మూర్ఖత్వం అవుతుంది.

No comments:

Post a Comment