నిన్న ఎలక్షన్ల ఫలితాలను విశ్లేషిస్తూ చిరంజీవి సమయం సరిపోలేదు అని ఓ మాట అన్నారు? రాజకీయాల్లోకి రావాలా వద్దా అంటూ కాలాయాపన చేసిందెవరు? ఏ పేరు పెట్టాలా అని రోజులు గడిపింది ఎవరు? మీటింగ్ ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తూ, వలస పక్షులకోసం ఎదురుచూస్తూ, మీటింగులకు వచ్చే వాళ్ళంతా వోట్లేస్తారన్న భ్రమలో వుండిదెవరు?
అయ్యా, రామారావు రాజకీయాల్లోకి వచ్చిన నాటి పరిస్థితి వేరు అని అందరు చెప్తున్నా విన్నారా? మీరు చేసిన సర్వేలు నిజాన్ని మీకు చెప్పాయా? మేధావుల మాటలు ప్రక్కన బెడితే ఏం జరుగుతుందో మీరే కాదు, కేసీయార్ సైతం ఇంకా నేర్చుకో లేదు. వెళ్ళిపోయిన వారి మీద అభాండాలు వేసారు గాని వాళ్ళు చేసిన విమర్శలను పట్టించుకున్నారా? వుట్టికెగరలేనమ్మ స్వర్గానికెగురుతానన్న సామెత వూరకే పుట్టలేదు మరి! ఇప్పుడైనా ఎవరు మనవారు అని ఆలోచించండి.
విశ్లేషణలు అని మరీ కాలయాపన చేయకండి?